Electric Bike: ఒక్క రీచార్జ్‌ తో 171 కిలోమీటర్లు.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేసింది

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ప్యూర్‌ ఈవీ మరో రెండు మోటర్‌ సైకిళ్లను దేశీయ మార్కెట్‌ కు పరిచయం చేసింది.

Electric Bike (Credits: X)

Hyderabad, Nov 24: ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన (Electric Bike) తయారీ సంస్థ ప్యూర్‌ ఈవీ (EV) మరో రెండు మోటర్‌ సైకిళ్లను దేశీయ మార్కెట్‌ (Domestic Market) కు పరిచయం చేసింది. సింగిల్‌ చార్జింగ్‌ తో 171 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మోటర్‌ సైకిల్‌ ను 110 సీసీ సామర్థ్యంతో సంస్థ రూపొందించింది. ఎకో డ్రైఫిట్‌ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. 3.5 కిలోవాట్‌ లీ-అయాన్‌ బ్యాటరీ కలిగిన ఈ బైకు గంటకు 75 కిలోమీటర్ల వేగంగా దూసుకుపోనున్నదని, రోజువారిగా అత్యధికంగా తిరిగేవారికి ఈ బైకుతో నెలకు రూ.7 వేల వరకు ఆదా కానున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ బైకు దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలో అందుబాటులో ఉంచినట్టు, కొనాలనుకునేవారు టెస్ట్‌ డ్రైవ్‌ చేసుకోవచ్చునని చెప్పారు.

Bhagavanth Kesari on OTT: ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్‌ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement