Assam Acid Attack: అస్సాంలో మహిళపై యాసిడ్ దాడి, చావు బతుకుల్లో బాధితురాలు, డబ్బుల విషయమై తలెత్తిన వివాదంతో దారుణానికి పాల్పడిన వ్యాపారి

అస్సాంలో మహిళపై యాసిడ్‌ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అస్సాంలోని ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం 3 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరికొకరు పరిచయస్తులే, కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు.

Representational Image | (Photo Credits: PTI)

అస్సాంలో మహిళపై యాసిడ్‌ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అస్సాంలోని ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం 3 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరికొకరు పరిచయస్తులే, కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. గత కొద్దిరోజులుగా ఇరువురి మధ్య డబ్బుల విషయమై వివాదం తలెత్తింది.ఈ నేపథ్యంలోనే నిందితుడు ఆ 30 ఏళ్ల మహిళపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను తేజ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దాడికి పాల్పడిన నిందితుడు వ్యాపారి వాస్తుకర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్‌ బిశ్వ శర్మ తెలిపారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement