CM Chandrababu Delhi Tour: అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీలో రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న రూ.15వేల కోట్ల రుణం తదితర అంశాలపై చంద్రబాబు చర్చించినట్టు సమాచారం.
నిర్మలా సీతారామన్తో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్తో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గోదావరి-పెన్నార్ నదుల అనుసంధానం, అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం, పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడంపై ప్రతిపాదన వంటివి చర్చకు వచ్చాయి. కేంద్రం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం.
CM Chandrababu Delhi Tour