Madhya Pradesh: శ్రీరామనవమి వేడుకల్లో ఘోర ప్రమాదం, ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో బావిలో పడిపోయిన భక్తులు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో.. శ్రీరామనవమి సందర్భంగా.. ఓ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో అక్కడున్న భక్తులంతా.. కింద ఉన్న మెట్ల బావిలో పడిపోయారు. ప్రస్తుతం వాళ్లను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌ శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ మందిర్‌లో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

temple collapsed in Patel Nagar area (Photo-ANI)

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో.. శ్రీరామనవమి సందర్భంగా.. ఓ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో అక్కడున్న భక్తులంతా.. కింద ఉన్న మెట్ల బావిలో పడిపోయారు. ప్రస్తుతం వాళ్లను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌ శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ మందిర్‌లో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాతిక మందికి పైగా భక్తులు బావిలో పడిపోయినట్లు సమాచారం. తొలుత స్థానికులు వాళ్లను బయటకు తీసేందుకు యత్నించారు. కొందరిని రక్షించగలిగారు. ఈలోపు పోలీసులు, వైద్య సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. పైకప్పు శిథిలాల కింద బావిలో భక్తులు ఇరుక్కుని ఉండడంతో.. వాళ్లను రక్షించడం కష్టతరంగా మారిందని అధికారులు చెప్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement