Uttar Pradesh: ప్రియుడు మోసం చేశాడని టవర్ ఎక్కిన యువతి, అతనితో వెంటనే పెళ్లి చేయకుంటే దూకి చచ్చిపోతానని బెదిరింపులు, వీడియో ఇదిగో..

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం మొబైల్ టవర్ ఎక్కింది. తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేశాడని, పెళ్లి చేస్తానన్న మాటకు కట్టుబడి ఉండేందుకు నిరాకరిస్తున్నాడని ఆ యువతి ఆరోపించింది.

Representational image (photo credit- IANS)

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం మొబైల్ టవర్ ఎక్కింది. తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేశాడని, పెళ్లి చేస్తానన్న మాటకు కట్టుబడి ఉండేందుకు నిరాకరిస్తున్నాడని ఆ యువతి ఆరోపించింది. ఈ ఘటన భితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెమ్రా రాజా టోల్ ప్లాజా సమీపంలో చోటుచేసుకుంది. బాలీవుడ్ క్లాసిక్ 'షోలే'లో ధర్మేంద్ర తాగి ఎక్కిన ఐకానిక్ దృశ్యానికి అద్దం పడుతూ మహిళ టవర్ పైకి ఎక్కడంతో అక్కడికి జనం గుమిగూడారు.

పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మహిళను సురక్షితంగా టవర్‌పై నుంచి కిందకు దించారు. ప్రస్తుతం మహిళ బాయ్‌ఫ్రెండ్ కనిపించకుండా పోయినప్పటికీ అతని తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి యువతి ప్రియుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement