Telangana Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం, కూరగాయల వ్యాపారుల పైకి దూసుకెళ్లిన లారీ, 10 మంది మృతి చెందినట్లుగా వార్తలు

తెలంగాణలోని చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా లారీ వారి మీదకు దూసుకెళ్లింది.

Truck Rams into Vegetable Vendors

తెలంగాణలోని చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా లారీ వారి మీదకు దూసుకెళ్లింది. లారీ తమ వైపుకు దూసుకు రావడం చూసిన కూరగాయల విక్రయదారులు అక్కడి నుంచి పరుగు పెట్టారు. అయితే వేగంగా వచ్చిన లారీ పలువురు పైనుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. లారీ ఎంత వేగంతో వస్తుందంటే... ఆ వేగానికి అది ఢీకొట్టిన చెట్టు కూడా కూలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టిన లారీ, బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతి చెందిన ప్రయాణికుడు, వీడియో ఇదిగో..

Tragic Road Accident in Ranga Reddy

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement