BJP leader Gyan Dev Ahuja: షాకింగ్ వీడియో.. 5 గురిని చంపామంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీసులు
రాజస్తాన్ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్ ఆహోజా (Rajasthan BJP Ex-MLA) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇప్పటివరకు తాము ఐదుగురిని హత్య చేశామని, గోహత్య చేసే వారిని చంపండి అంటూ.. నినాదాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
రాజస్తాన్ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్ ఆహోజా (Rajasthan BJP Ex-MLA) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇప్పటివరకు తాము ఐదుగురిని హత్య చేశామని, గోహత్య చేసే వారిని చంపండి అంటూ.. నినాదాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ హత్యలు లాలావాండి లేదా బెహ్రూర్లో కావచ్చు అంటూ రక్బర్ ఖాన్, పెహ్లూ ఖాన్ హత్యలు గురించి వీడియోలో ఆయన (Rajasthan BJP leader Gyan Dev Ahuja) ప్రస్తావించారు.
అంతేకాదు వాటిలో ఒక హత్యను 2017లో మరోకటి 2018లో చేశామని బహిరంగంగా చెప్పారు. అవన్నీ కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామ్గఢ్లో జరిగిందని చెప్పడం విశేషం. కాగా తమ కార్యకర్తలకు చంపడానికి స్వేచ్ఛ ఇచ్చానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారు హత్య చేసిన వెంటనే బెయిల్ పొందడమే గాక నిర్దోషులుగా విడుదలవుతారని చాలా ధీమాగా చెబుతున్నారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)