Char Dham Yatra: నేడు తెరుచుకోనున్న కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు.. 12న తెరుచుకోనున్న బద్రీ నాథ్ ఆలయం
ఆలయ మూర్తులకు భక్తుల పూజలు నేటి నుంచి ప్రారంభమవుతాయి.
Newdelhi, May 10: ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని కేదార్ నాథ్ (Kedarnath), గంగోత్రి (Gangotri), యమునోత్రి (Yamunotri) దేవాలయాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయ మూర్తులకు భక్తుల పూజలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. శీతాకాలంలో మూసివేసిన దేవాలయాలను భక్తుల కోసం నేటి నుంచి తెరుస్తున్నారు. కేదార్ నాథ్, యమునోత్రి దేవాలయాలను శుక్రవారం ఉదయం 7 గంటలకు తెరిచారు. గంగోత్రి దేవాలయాన్ని మధ్యాహ్నం 12.20 గంటలకు, బద్రీ నాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరుస్తారు.