Rajasthan Accident: రాజస్థాన్‌ లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి రైలు పట్టాలపై పడ్డ బస్సు.. నలుగురు మృతి.. 30 మందికి గాయాలు.. ప్రమాద సమయంలో బస్సులో 34-38 మంది ప్రయాణికులు

రాజస్థాన్‌ లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన పై నుంచి వెళుతున్న బస్సు అదుపు కోల్పోయి కింద ఉన్న రైలు పట్టాలపై పడటంతో నలుగురు దుర్మరణం చెందారు.

Bus Accident (Credits: X)

Jaipur, Nov 6: రాజస్థాన్‌ (Rajasthan) లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన పై (Bridge) నుంచి వెళుతున్న బస్సు (Bus) అదుపు కోల్పోయి కింద ఉన్న రైలు పట్టాలపై (Rail Track) పడటంతో నలుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 34-38 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో తీవ్రంగా గాయపడిన 34 మందిలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. పూర్త్ఘి వివరాలు తెలియాల్సి ఉంది.

Ram Pothineni On Trolls: బోయపాటిపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్, ఘాటుగా స్పందించిన హీరో రామ్, అవును బోయపాటి డూప్‌గా చేశారు, అసలు ఏం జరిగిందో తెలుసా? అంటూ ఫోటో పెట్టిన రామ్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement