Dog Bite: కుక్క కరిచినా ఇంట్లో చెప్పని బాలుడు.. నెల రోజుల తర్వాత రేబిస్ తో మృతి.. ఘజియాబాద్ లో విషాదం
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్ కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు.
Newdelhi, Sep 6: ఉత్తరప్రదేశ్ లోని (Uttar Pradesh) ఘజియాబాద్ లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు (Dog Bite) తన పేరెంట్స్ కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ (Rabies) వ్యాధితో చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ (Ghaziabad) లోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన షావాజ్ (14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం పొరుగింట్లో ఉన్న ఓ కుక్క షావాజ్ ను కరిచింది. భయంతో ఈ విషయాన్ని అతను తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బాలుడి అనారోగ్యానికి గురయ్యాడు. ఆహారం తినడం మానేశాడు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో షావాజ్ను కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, తనను నెల రోజుల క్రితం ఓ కుక్క కరిచిందని తెలిపాడు. ఇక తీవ్ర అస్వస్థతకు గురైన షావాజ్ను అంబులెన్స్లో తీసుకెళ్తుండగా షావాజ్ ప్రాణాలు కోల్పోయాడు.