Uttar Pradesh: నేరుగా క్లాస్ రూంలోకి వచ్చిన చిరుతపులి, పదేళ్ల బాలుడిపై దాడి, భయంతో పరుగులు పెట్టిన మిగతా విద్యార్థులు
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో టీచర్ పాఠం చెప్తుండగా ఓ చిరుత సైలెంట్గా తరగతి గదిలోకి వచ్చింది. క్లాస్ వింటున్న ఒక పదేళ్ల బాలుడిపై దాడి చేసింది. అక్కడ చౌదరీ నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్లో ఈ ఘటన జరిగింది. చిరుత దాడి గురించి తెలిసిన ఇతర విద్యార్థులంతా భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. దీంతో కాలేజ్ గేటు వద్ద తొక్కిసలాట జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో టీచర్ పాఠం చెప్తుండగా ఓ చిరుత సైలెంట్గా తరగతి గదిలోకి వచ్చింది. క్లాస్ వింటున్న ఒక పదేళ్ల బాలుడిపై దాడి చేసింది. అక్కడ చౌదరీ నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్లో ఈ ఘటన జరిగింది. చిరుత దాడి గురించి తెలిసిన ఇతర విద్యార్థులంతా భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. దీంతో కాలేజ్ గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. దీనిలో కొందరు గాయపడ్డారు కూడా. చిరుత దాడి చేసిన విద్యార్థి కూడా తప్పించుకున్నాడు. అతనికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.అతనికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం వెంటనే ఫారెస్టు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement