Andhra Pradesh Horror: నంద్యాల ఘటన మరచిపోకముందే మరో దారుణం, తిరుపతిలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కామాంధుడు

నంద్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య ఘటన మర్చిపోకముందే తిరుపతిలో మరో చోట ఘోరం జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లిలో ఎనిమిదేళ్ల బాలికపై బీహార్ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని నేషనల్ హైవే పక్కన రైస్ మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు

8-year-old girl Rape and murdered in Tirupati

ఏపీలో నంద్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య ఘటన మర్చిపోకముందే తిరుపతిలో మరో చోట ఘోరం జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లిలో ఎనిమిదేళ్ల బాలికపై బీహార్ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని నేషనల్ హైవే పక్కన రైస్ మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. బిస్కెట్లు ఇచ్చి బాలికను యువకుడు చెట్ల పొదల్లోకి తీసి అఘాయిత్యానికి పాల్పడ్డారు.  నంద్యాల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు, ఆ ముగ్గురు సెల్‌ఫోన్లో వీడియోలు చూసి పార్కులో ఆడుకుంటున్న బాలికపై..

అనంతరం బాలికను చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. రైస్ మిల్లులో పని చేసే కార్మికుడు కూతురి మృతదేహంగా గుర్తించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు స్థానిక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గురువారం నిందితుడి జైల్లో ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement