Coronavirus in Andhra Pradesh: ఏపీలో 24 గంటల్లో 38 మంది కరోనాతో మృతి, కొత్తగా 9,716 కోవిడ్ కేసులు నమోదు, శ్రీకాకుళంలో అత్యధికంగా 1444 కేసులు నమోదు, అత్యల్పంగా వెస్ట్ గోదావరిలో 106 కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసుల పెరుగుదలతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 39,619 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 9,716 కేసులు నిర్థారణ (AP coronavirus) అయ్యాయి. గత 24 గంటల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,83,808 కరోనా బారీన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 9,16,090 డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఇప్పటివరకు కరోనాతో 7,510 మంది (Coronavirus Deaths) మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 60,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)