Corona in AP: ఏపీలో కొత్తగా 503 మందికి కోవిడ్, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6932 యాక్టివ్ కేసులు
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32, 846 శాంపిల్స్ పరీక్షించగా.. 503 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 12 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 817 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32, 846 శాంపిల్స్ పరీక్షించగా.. 503 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 12 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 817 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,88,00, 809 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,58, 065 కు పెరిగింది.. ఇక, 20,36, 865 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14, 268 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 6932 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)