Andhra Pradesh: వరుసగా నాలుగో యేడాది జాతీయ అవార్డును దక్కించుకున్న APSRTC, డిజిటల్ సేవల్లో సత్తా చాటుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా నాలుగో యేడాది కూడా జాతీయ అవార్డును దక్కించుకుంది. డిజిటల్ సేవల్లో సత్తా చాటుతూ ఇప్పటికే మూడుసార్లు అవార్డును దక్కించుకోగా, తాజాగా మరోమారు ఈ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందుకున్నారు.

APSRTC Buses. (Photo Credit: PTI)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా నాలుగో యేడాది కూడా జాతీయ అవార్డును దక్కించుకుంది. డిజిటల్ సేవల్లో సత్తా చాటుతూ ఇప్పటికే మూడుసార్లు అవార్డును దక్కించుకోగా, తాజాగా మరోమారు ఈ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందుకున్నారు. ఆర్టీసీ నిర్వహణ, పరిపాలనలో డిజిటల్ సేవలను, విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సంస్థలకు ప్రతియేటా డిజిటల్ టెక్నాలజీ సభ ప్రతియేటా ఈ అవార్డులను ఇస్తుంది. యాప్ ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టిక్కెట్ల జారీ తదితర అంశాల్లో ఏపీఎస్ఆర్టీసీ డిజిటల్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ అవార్డు కోసం ప్రతి యేటా అనేక సంస్థలు పోటీపడుతుంటాయ. అయినప్పటికీ ఏపీఎస్‌ఆర్టీసీ వరుసగా నాలుగో యేడాది దక్కించుకోవడం గమనార్హం.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement