Andhra Pradesh: చెరువులు, కాలువల్లో చేపల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీకి మొదటి ర్యాంక్, 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో అగ్రస్థానంలో నిలిచిన ఏపీ ప్రభుత్వం
ఇన్ల్యాండ్లో 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత 16.52 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్, 8.09 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్, 7.89 లక్షల టన్నులతో ఒడిశా, 7.62 లక్షల టన్నులతో బిహార్ వరుస స్థానాలు పొందాయి.
చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల్లో (ఇన్ల్యాండ్) చేపలను ఉత్పత్తి చేయడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇన్ల్యాండ్లో 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత 16.52 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్, 8.09 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్, 7.89 లక్షల టన్నులతో ఒడిశా, 7.62 లక్షల టన్నులతో బిహార్ వరుస స్థానాలు పొందాయి.
కాగా, సముద్ర మత్స్య ఉత్పత్తుల్లో 7.02 లక్షల టన్నులతో గుజరాత్ మొదటి స్థానం, 6.01 లక్షల టన్నులతో కేరళ రెండోస్థానం, 5.95 లక్షల టన్నులతో తమిళనాడు మూడో స్థానంలో ఉండగా.. 5.94 లక్షల టన్నులతో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. చేపల ఉత్పత్తిలో 2021–22 సంవత్సరానికి సంబంధించి జాతీయ సగటు వృద్ధి రేటును పరిశీలిస్తే.. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 6.61 శాతంగా నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 12.57 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది.
Here's YSRCP Tweet