Andhra Pradesh: వీడియో ఇదిగో, నూజివీడులో పట్టపగలే వైసీపీ నేతపై కత్తులతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో..

రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నూజివీడులో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతపై కత్తులతో దాడి చేశారు.

Andhra Pradesh: TDP workers attacked YCP worker with knives in Nuziveedu Watch Videos

రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నూజివీడులో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతపై కత్తులతో దాడి చేశారు. నూజివీడు టౌన్‌ పెద్ద గాంధీ బొమ్మ సెంటర్‌లో కత్తులతో వైఎస్సార్‌సీపీ నేత మీద దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ నడకుదుటి గిరీష్‌పై దాడి చేశారు.ఈ ఘటనలో గిరీష్‌ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Here's Video

 

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement