Chandrababu Arrest: న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తి పట్టడమే, చంద్రబాబు కేసు వాదిస్తున్న లాయర్ సిద్ధార్థ లూథ్రా సంచలన ట్వీట్, జైలులో బాబును కలిసిన న్యాయవాది

చంద్రబాబు కేసు వాదిస్తున్న లాయర్ సిద్ధార్థ లూథ్రా ఎక్స్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇవాళ్టి నినాదం ఇదే అంటూ గురు గోబింద్ సింగ్ ప్రవచనాలను పంచుకున్నారు. అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ న్యాయం కనుచూపు మేరలో కనిపించకపోతే... ఇక చేతిలోకి కత్తి తీసుకుని శక్తి ఉన్నంతవరకు పోరాడడమే మార్గం" అని ఆ ప్రవచనాలలో గురు గోబింద్ పేర్కొన్నారు.

Sidharth Luthra (photo-X)

చంద్రబాబు కేసు వాదిస్తున్న లాయర్ సిద్ధార్థ లూథ్రా ఎక్స్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇవాళ్టి నినాదం ఇదే అంటూ గురు గోబింద్ సింగ్ ప్రవచనాలను పంచుకున్నారు. అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ న్యాయం కనుచూపు మేరలో కనిపించకపోతే... ఇక చేతిలోకి కత్తి తీసుకుని శక్తి ఉన్నంతవరకు పోరాడడమే మార్గం" అని ఆ ప్రవచనాలలో గురు గోబింద్ పేర్కొన్నారు. నాడు ఔరంగజేబ్ ను ఉద్దేశించి గురు గోబింద్ సింగ్ రాసిన జాఫర్ నామాలో ఈ ప్రవచనాలు ఉన్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కలిశారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లూథ్రా న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణను లూథ్రా.. చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది.

Sidharth Luthra (photo-X)

Here's Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement