Prof GP Rajasekhar: ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, పలు యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ను నియమించారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్ పూర్ లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు. రాజశేఖర్ ఏయూ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ను నియమించారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్ పూర్ లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు. రాజశేఖర్ ఏయూ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఇక, కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సీఎస్సార్కే ప్రసాద్ ను నియమించారు. ప్రసాద్ ప్రస్తుతం వరంగల్ ఎన్ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రసాద్ జేఎన్టీయూ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. యోగి వేమన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి.ప్రకాశ్ బాబును నియమించారు. ప్రకాశ్ బాబు... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనిస్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ విభాగంలో బయోటెక్నాలజీ సీనియర్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ప్రకాశ్ బాబు యోగి వేమన వర్సిటీ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు వీసీల నియామకంపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
Prof GP Rajasekhar appointed as Andhra University Vice Chancellor