TDP Activists Attacked DC Office: డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడిని ఖండించిన జగన్, నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమని వెల్లడి

వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. టీడీపీకి చెందిన వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గుడ్డిగా టీడీపీకి వత్తాసు పలకుండా నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమే ఈ దాడి అని జగన్ అభివర్ణించారు.

YS Jagan (photo-Video Grab)

ఏపీలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు డెక్కన్‌ క్రానికల్‌ ఆఫీస్‌ మీద దాడికి తెగబడ్డారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. దీనిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు.  వీడియో ఇదిగో, డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన డీసీ

టీడీపీకి చెందిన వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గుడ్డిగా టీడీపీకి వత్తాసు పలకుండా నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమే ఈ దాడి అని జగన్ అభివర్ణించారు. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీలో ప్రజాస్వామ్యం పదేపదే ఉల్లంఘనలకు గురవుతోందని... ఏపీ ముఖ్యమంత్రి దీనికి కచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ పేర్కొన్నారు.

Here's Jagan Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement