CM Jagan on Polavaram Project: 2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపిన సీఎం జగన్, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలస్యం అయిందని వెల్లడి

2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడంతో పాటు స్పిల్ వే పనులు పూర్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం ఆలస్యమైందన్నారు.

YS jagan

2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడంతో పాటు స్పిల్ వే పనులు పూర్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం ఆలస్యమైందన్నారు. వారు స్పిల్ వే కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకపోవడం వల్ల గ్రామాలు ముంపుకు గురవుతున్నాయన్నారు.

పోలవరం విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు. మీ బిడ్డ అలా చేయడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది మీ కోసమే అన్నది మరిచిపోవద్దు. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తేర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. - సీఎం వైయస్ జగన్

Here's YSRCP Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement