Bus Fire in Hyderabad: ఘోర ప్రమాదం, బస్సును గుద్దడంతో ఒక్కసారిగా పేలిన బైక్ ట్యాంకర్, మంటల్లో చిక్కుకున్న రెండు వాహనాలు, యువకుడు మృతి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీనోమ్ వ్యాలీలోని ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం ఉదయం దగ్ధమైంది. బస్సును ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీనోమ్ వ్యాలీలోని ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం ఉదయం దగ్ధమైంది. బస్సును ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది.. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు ఎగసిపడ్డాయి. బైక్ తో పాటు బస్సు కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్సులోని ఉద్యోగులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. మృతి చెందిన సంపత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు.
Bus gutted after hitting a bike at Shameerpet, one dead (Photo-IANS)
Here's IANS Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Advertisement
Advertisement
Advertisement