Mahalaxmi Scheme: 28వ తేది నుంచి రూ 500కే గ్యాస్ సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది.
Hyderabad, Dec 21: మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులు ఎంతమంది, ఎవరెవరికి ఈ పథకం వర్తింపజేయాలనేది నిర్ణయించనున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంతనేది లెక్కలు తీస్తున్నారు. అధికార గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెల నెలా 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులు అందరికీ సబ్సిడీ ఇస్తే ఖజానాపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడనుందని అంచనా.
Advertisement
సంబంధిత వార్తలు
GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ
Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??
Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్ రైతులకు పెట్టుబడి సాయంపై మంత్రి కీలక ప్రకటన, అప్పుడే రైతులకు రూ. 20వేలు ఇస్తామని ప్రకటన
Andhra Pradesh: బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రధానంగా చర్చ, వీడియో ఇదిగో..
Advertisement
Advertisement
Advertisement