Telangana: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో వెళుతుండగా గర్భిణికి పురిటి నొప్పులు, బస్సులోనే ఆమెకు పురుడు పోసిన తోటి మహిళా ప్రయాణికులు

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి తోటి మహిళా ప్రయాణికులు సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు

Woman gives birth to baby on TGSRTC bus (Photo-X)

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ తోటి మహిళా ప్రయాణికులు సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. జిల్లాలోని కేటి దొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామానికి చెందిన మరియమ్మకు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని బావి దొడ్డి గ్రామానికి చెందిన నరేశ్​ తో వివాహం జరిగింది. మరియమ్మ గర్భిణి కాగా ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు రాయచూర్​ నుంచి గద్వాల్​కు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కారు.

కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి జీవితాంతం బస్ ఫ్రీ, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ, వీడియో ఇదిగో..

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మరియమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్​కు చెప్పి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో బస్సులోనే మహిళా ప్రయాణికులంతా కలిసి ఆమెకు పురుడు పోశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్టీసీ సిబ్బంది 108 అంబులెన్స్​లోని వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమం ఉన్నారు.

Woman gives birth to baby on TGSRTC bus 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement