Earth 2.0: జనాభా, వనరుల విధ్వంసం, వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో గుడ్ న్యూస్.. భూమిని పోలిన మరో గ్రహం.. గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు
వనరుల విధ్వంసం భారీగా జరుగుతుంది. వాతావరణ కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెరసి మానవ మనుగడే ప్రశ్నార్థకం అయింది.
Newdelhi, May 25: ఒకవైపు జనాభా (Population) విపరీతంగా పెరిగిపోతుంది. వనరుల విధ్వంసం భారీగా జరుగుతుంది. వాతావరణ కాలుష్యం (Pollution) ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెరసి మానవ మనుగడే ప్రశ్నార్థకం అయింది. దీంతో మనిషి జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించే ప్రయోగాలు ఎన్నటినుంచో జరుగుతున్నాయి. తాజాగా భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్టు నాసా పరిశోధకులు ప్రకటించారు. ఈ ఎక్సో ప్లానెట్ పేరును గ్లీస్ 12బీగా పేరుపెట్టారు.