Morocco Earthquake: మొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు.. గాయపడిన వారిలో 1,404 మంది పరిస్థితి విషమం
మొరాకో భూకంప విలయంలో (Morocco Earthquake) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. మరో 2 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
Vijayawada, Sep 10: మొరాకో భూకంప విలయంలో (Morocco Earthquake) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. మరో 2 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు 2,012 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. గాయపడిన 2,059 మందిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం చరిత్రలో ఇంత పెద్ద భూకంపం (Earthquake) ఇదే తొలిసారని చెబుతున్నారు. తీర ప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో బలమైన ప్రకంపనలు సంభవించినట్టు పేర్కొన్నారు. భూకంప కేంద్రం అల్హౌజ్ ప్రావిన్స్లోని ఇఘిల్ పట్టణ సమీపంలో, మర్రకేశ్కు దక్షిణాన దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
Advertisement
సంబంధిత వార్తలు
David Miller: సెమీస్లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్
1xBet బ్రాండ్ అంబాసిడర్గా క్రికెట్ స్టార్ హెన్రిచ్ క్లాసీన్, సౌతాఫ్రికాత్ స్టార్తో ఒప్పందం చేసుకున్న గ్లోబల్ కంపెనీ
South Africa Beat England by Seven Wickets: ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఈజీగా నెగ్గిన సౌతాఫ్రికా, చాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో బెర్త్ ఖరారు
Australia Qualify For Semifinal: వర్షం కారణంగా రద్దైన ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్ మ్యాచ్, చెరో పాయింట్ ఇవ్వడంతో సెమీస్కు చేరిన ఆసిస్
Advertisement
Advertisement
Advertisement