AP Assembly Budget Session 2022: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ హరిచందన్‌, అనంతరం సభ వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session 2022) మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (ndhra Pradesh Governor) ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరుగనుంది.

Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Amaravati, Mar 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session 2022) మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (ndhra Pradesh Governor) ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు.బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి.

కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్‌ సమావేశాల సమయంలో వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. తాజాగా గవర్నర్‌ ప్రసంగం అనంతరం బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. బీఏసీ సమావేశం ముగిశాక వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే, ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని తెలిపిన కేంద్ర మంత్రి షెకావత్, కొనసాగుతున్న సీఎం జగన్ పోలవరం పర్యటన

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతిపై శాసనసభలో మంగళవారం సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. అదే రోజు స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభ సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సమావేశాల ఎజెండా, ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. బుధ, గురువారాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 11న (శుక్రవారం) 2022-23 బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు. సమావేశాలు 25వ తేదీదాకా లేదంటే నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement