Andhra Pradesh Acid Attack Case: యువ‌తిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి, నా చెల్లెలికి అండగా ఉంటానని తెలిపిన నారా లోకేష్, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. బాధిత యువ‌తికి, ఆమె ఫ్యామిలీకి ప్ర‌భుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

Lover throw acid on Young Women who refused to love in Annamayya District

Vjy, Fab 14: ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లాలో గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లె గ్రామానికి చెందిన యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్ప‌డిన సంగతి విదితమే. ఈ దాడిని సీఎం చంద్ర‌బాబు తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. బాధిత యువ‌తికి, ఆమె ఫ్యామిలీకి ప్ర‌భుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

అటు ఈ ఘ‌ట‌న‌పై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసింద‌న్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సాయం అందించి అండ‌గా నిలుస్తామ‌ని భ‌రోసా క‌ల్పించారు. ఆమె ప‌ట్ల అత్యంత పాశవికంగా వ్య‌వ‌హ‌రించిన నిందితుడిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా పోలీసు యంత్రాంగం త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు.

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి, ప్రేమోన్మాది తనకు దక్కలేదనే కోపంతో కక్షకట్టి మరీ..

యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్ధన్ కు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆయనకు పూర్తి భరోసా ఇచ్చారు. చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం. ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడిచేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం, అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.

కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నాను" అంటూ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. అక్కడే ఉన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తో కూడా మాట్లాడిన లోకేశ్... బాధితురాలు కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా సూచించారు.

యాసిడ్ దాడికి, అత్యాచారానికి గురైన బాధితురాలిని ఏపీ అధికారులు బెంగళూరుకు తరలిస్తున్నారు. బాధితురాలిని మొదట మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బెంగళూరుకు తరలించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బాధితురాలిని అధికారులు బెంగళూరుకు తరలిస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement