Free Sand Policy in Andhra Pradesh: ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం అమల్లోకి, చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం, వైసీపీ అక్రమాలపై విచారణ..

త్వరలో ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి తెలిపారు

Kollu Ravindra (photo-Video Grab)

Vjy, July 3: త్వరలో ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో కూడా ఇసుక అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో ఎవరికీ ఇసుక కొరత ఉండదని మంత్రి చెప్పారు.

ఎవరైనా ఇసుకను బ్లాక్ మార్కెట్ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇసుక పంపిణీని అధికారులు నిశితంగా పరిశీలిస్తారని మంత్రి తెలిపారు. 2014, 2019లో టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చిందని, మరోసారి అదే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతామని మంత్రి తెలిపారు. ఉచిత ఇసుక పంపిణీలో సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటామన్నారు. మూడు నెలల పాటు స్టాక్ పాయింట్లు, సిల్ట్ నుంచి ఇసుక తీస్తామన్నారు. అమరావతిని చూస్తే ఎంతో బాధ కలుగుతోంది, నా కష్టం అంతా జగన్ వృథా చేశాడని మండిపడిన చంద్రబాబు, శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి

40 సెక్టార్లు ఇసుకపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఇసుక సరఫరా వల్ల రాష్ట్రంలో నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించడంతో పాటు నిర్మాణ కార్యకలాపాలు రాష్ట్రానికి జిఎస్‌టిని తీసుకువస్తాయని ఆయన అన్నారు. ఇసుక సరఫరా వ్యవస్థను నాశనం చేసిన గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, మాజీ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ బయోడేటా ఇదే..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఇసుకను దుర్వినియోగం చేసి అధిక ధరకు ప్రజలకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనివల్ల నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు ఐదేళ్లుగా ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. ఇసుకను దోచుకోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక సరఫరా కోసం జేపీ ఇన్‌ఫ్రా తీసుకొచ్చిందని మంత్రి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు దోచుకున్నారని, ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు చేసిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణకు ఆదేశించనుంది. దోషులకు శిక్ష పడుతుందని మంత్రి తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement