YSRCP Plenary: మేనిఫెస్టోలో 95శాతం హామీలు నెరవేర్చాం! మా మేనిఫెస్టో చూసేందుకే టీడీపీకి వణుకుపుడుతోంది, వైయస్సార్సీపీ 13 ఏళ్ల ప్రస్థానంపై సీఎం జగన్ పవర్ఫుల్ స్పీచ్
2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతంమేర పూర్తి చేసినట్లు చెప్పారు. ఏ ప్రభుత్వానికి సాధ్యంకాని పథకాలను తాము తీసుకువచ్చినట్లు చెప్పారు. మేనిఫెస్టోల్లో (Manifesto) హామీలు ఇచ్చి మాయలు చేసే పార్టీలను చూశాం, కానీఈ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు తాము ప్రతిక్షణం తపనపడ్డామన్నారు
Guntur, July 09: వైయస్సార్ కాంగ్రెస్ ప్లీనరీలో (YSRCP Plenary) కార్యకర్తలకు జోష్ ఇచ్చేలా ప్రసంగించారు పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan). 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతంమేర పూర్తి చేసినట్లు చెప్పారు. ఏ ప్రభుత్వానికి సాధ్యంకాని పథకాలను తాము తీసుకువచ్చినట్లు చెప్పారు. మేనిఫెస్టోల్లో (Manifesto) హామీలు ఇచ్చి మాయలు చేసే పార్టీలను చూశాం, కానీఈ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు తాము ప్రతిక్షణం తపనపడ్డామన్నారు సీఎం జగన్. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రజలు నిలదీస్తారని టీడీపీ(TDP) మేనిఫెస్టోను మాయం చేసిన సంగతి అందరికీ తెలుసు. కానీ తాము మాత్రం మేనిఫెస్టోలో పెట్టిన 95 శాతం అంశాలను నెరవేర్చినట్లు చెప్పారు సీఎం జగన్. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను చూడటానికే టీడీపీ భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైఎస్సార్సీపీ అని గర్వంగా చెప్తున్నామన్నారు సీఎం జగన్.
ఇక వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan) ప్రారంభోపన్యాసం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. 2009, సెప్టెంబర్ 25న పావురాలగుట్టలో సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చింది. వైఎస్సార్ (YSR) ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించింది. నన్ను ప్రేమించి, నాతో వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. ఈ 13ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. నాన్న నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం నా చేయి ఎప్పుడూ వదల్లేదు. ప్రజలు మూడేళ్ల కిందట కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. నాకు ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడు నా చేయి వీడలేదు. మన పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. కాబట్టి గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు అని సీఎం జగన్ అన్నారు.
దుష్టచతుష్టయం మన పాలనలో మంచి ని ఓర్వలేక అబద్దాల విషప్రచారం చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారు. ఆ కట్టుకథల్ని, వాటికి అబద్ధాలు జోడించి ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. గతంలో రాష్ట్రాన్ని దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా వ్యవహరించింది. ఇప్పుడు అవకాశం లేక కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో ఉంది. గజదొంగల ముఠా మాత్రం, ఎల్లో మీడియా, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. వాళ్లకు, మనకు ఎక్కడా పోలిక లేదు. మనది చేతల పాలన.. వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని సీఎం జగన్ అన్నారు.
Tags
సంబంధిత వార్తలు
SRK on Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై సజ్జల రామకృష్ణారెడ్డి తొలి స్పందన ఇది! టీడీపీ గెలుస్తుందన్న సర్వేలపై సజ్జల ఏమన్నారంటే?
Exit Polls 2024: కడపలో షర్మిల గెలుస్తారా? ఓడిపోతున్నారా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో తెలుసా
AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి
Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు
Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు
Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..
Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..
Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Telangana Capital Hyderabad: హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ