Andhra Pradesh: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్, కొత్తగా 3.36 లక్షల మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు, ఇందుకోసం రూ.137 కోట్ల నిధులు విడుదల, వైఎస్సార్‌ పింఛన్‌ కానుకకు కొత్తగా 2,99,085 మంది ఎంపిక

సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఏపీ సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని భావించిన జగన్ ప్రభుత్వం (CM YS Jagan Mohan Reddy Govt) కొత్తగా అర్హత ఉండి పథకాలు అప్లయి చేసుకున్నవారికి లబ్ది చేకూర్చేందుకు సిద్ధమయింది.

CM-YS-jagan-Review-Meeting

Amaravati, July 19: సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఏపీ సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని భావించిన జగన్ ప్రభుత్వం (CM YS Jagan Mohan Reddy Govt) కొత్తగా అర్హత ఉండి పథకాలు అప్లయి చేసుకున్నవారికి లబ్ది చేకూర్చేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలకు ( welfare benefits ) దరఖాస్తు చేసుకున్న వాళ్లకు తాజాగా పథకాలు మంజూరు చేసింది.

ఈ మేరకు కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) నగదు జమ చేయనున్నారు. మొత్తం 3.36 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతిఫలం అందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వైఎస్సార్‌ పింఛన్‌ కానుకకు కొత్తగా 2,99,085 మంది ఎంపికయ్యారు. కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసింది ఏపీ సర్కార్‌. గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు, రేపు చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, తెలంగాణలో కూడా రెండు రోజుల పాటు భారీ వర్షాలు

ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. సచివాలయం విజిట్‌ పూర్తయిన వెంటనే కలెక్టర్లు నిధులిస్తారని సీఎం ప్రకటించారు. 10 రోజుల్లోపు గడప గడప చేసిన వారి పేర్లు సీఎం జగన్‌ చదివి వినిపించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు

Telangana Teacher's MLC Elections: ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్, నల్గొండ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుంచి మల్క కొమురయ్య విజయం

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు, రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించిన పోలీసులు, బీఎన్‌ఎస్‌ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు

AP Assembly Session 2025: మెగా డీఎస్సీపై నారా లోకేష్ కీలక ప్రకటన, త్వరలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విద్యా శాఖ మంత్రి

Share Now