Sajjala Rama Krishna Reddy: ఏపీలో బీజేపీని చూస్తే జాలేస్తోంది, మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు, సీఎం వైఎస్‌ జగన్‌ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారని మండిపడిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు అజెండానే బీజేపీ నేతల అజెండా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) విమర్శించారు. టీడీపీ అనుబంధ విభాగం మాదిరి బీజేపీ సభ జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు.

Sajjala Ramakrishna Reddy (Photo-Twitter)

Amaravati, Dec 29: టీడీపీ అధినేత చంద్రబాబు అజెండానే బీజేపీ నేతల అజెండా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) విమర్శించారు. టీడీపీ అనుబంధ విభాగం మాదిరి బీజేపీ సభ జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు అజెండా ప్రకారమే రాష్ట్రంలో బీజేపీ (BJP) నడుస్తోందన్నారు. ఎక్కడైనా జాతీయ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయి.

ఏపీలో మాత్రం రివర్స్ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీ పని చేస్తోంది. ఏపీ బీజేపీని (AP BJP) చూస్తుంటే జాలితో పాటు బాధ కలుగుతోందన్నారు. మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఇప్పటి నుంచే పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోంది. సొంత అజెండాతో బీజేపీ ఎందుకు పనిచేయడం లేదు. తన పార్టీ ఎంపీలు బీజేపీలో చేరితే టీడీపీ ఎందుకు ప్రశ్నించదు అని సజ్జల ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

సోము వీర్రాజు క్వార్టర్ సీసా రూ.50 వ్యాఖ్యలు, ఎంత సిగ్గుమాలిన హామీ అంటూ ట్విట్టర్లో సెటైర్ వేసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు ఆయనవేననీ.. స్ట్రిప్ట్‌ మాత్రం టీడీపీ కార్యాలయంలో తయారవుతోందని ఆరోపించారు.టీడీపీ, బీజేపీలకు సొంత అజెండా ఉండటం లేదన్నారు. ఇంత దిగజారుడుతనం ఎందుకో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ''రాజధాని అమరావతి స్కాములమయం అని గతంలో బీజేపీ నేతలు అన్నారు. ఇప్పుడే ఆ పార్టీ నేతలే అధికారం అప్పగిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారు.

మాకు కోటి ఓట్లు వేస్తే రూ.70కే మద్యం అందిస్తాం, ఆదాయం ఉంటే మద్యం ధర రూ.50కి తగ్గిస్తాం, ప్రజాగ్రహ సభలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

కర్నూలులో హైకోర్టు ఉండాలంటారు. విశాఖ వద్దు ఆ రెండు ప్రాంతాలే కావాలని చెప్పొచ్చు కదా. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదని బీజేపీ వాళ్లే అంటారు.. ఈ విషయంలో వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారనీ వాళ్లే ప్రశ్నిస్తారు. ఆయా పార్టీలతో చంద్రబాబు విజయవంతంగా తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు'' అని సజ్జల ఎద్దేవా చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement