Coronavirus in AP: ఏపీలో తాజాగా 4,994 కరోనా కేసులు నమోదు, ఒక్కరోజులో 62 మంది మృత్యువాత, రాష్ట్రంలో 58,668కి చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్లో తాజాగా 4,994 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 37,162 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,994 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొంది. తాజాగా కరోనాతో కోలుకున్న 1,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 25,574కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,336 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Amaravati, July 21: ఆంధ్రప్రదేశ్లో తాజాగా 4,994 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 37,162 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,994 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొంది. తాజాగా కరోనాతో కోలుకున్న 1,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 25,574కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,336 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో మహిళలకు మంచి రోజులు, అమూల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం, దక్షిణాది రాష్ట్రాలకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని తెలిపిన ఏపీ సీఎం
రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 62 మరణాలు (Coronavirus Deaths in AP) సంభవించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 758కి చేరింది. తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, విశాఖపట్నం జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు, గుంటూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు కన్నుమూశారు. దాంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 758కి పెరిగింది. కొత్త మంత్రి పదవులు ఆ ఇద్దరికేనా? రేపే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం
గుంటూరులో ఒక్కరోజే 577 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 10 మంది, విశాఖపట్నంలో 9, చిత్తూరులో 8 మంది, శ్రీకాకుళంలో 7గురు, అనంతపురంలో 6గురు, పశ్చిమగోదావరిలో 6గురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5గురు, కర్నూలులో నలుగురు, కడపలో ఒకరు చొప్పున కరోనాతో చనిపోయారు. 24 గంటల్లో 37,162 శ్యాంపిల్స్ను పరీక్షించారు. మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 13,86,274 శాంపిల్స్ను పరీక్షించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)