AP Lockdown: మార్చి 31 వరకు ఏపీ లాక్‌డౌన్, అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేత, ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి, మీడియాతో ఏపీ సీఎం వైయస్ జగన్

కరోనా వైరస్ (Coronavirus) తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ (AP Lockdown) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు.

Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, Mar 22: కరోనా వైరస్ (Coronavirus) తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ (AP Lockdown) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు, 5కు చేరిన మొత్తం కరోనా కేసులు

మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు.

గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు. మార్చి 29 వ తేది నాటికి పూర్తిగా రేషన్‌ అందుబాటులోకి ఉంటుందని, రేషన్‌ ఫ్రీగా ఇవ్వడమేక కాకుండా కేజీ పప్పును ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1000 అందిస్తామని తెలిపారు.

మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌‌డౌన్‌

విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా 14 రోజులు ఇళ్లలోనే ఉండాలన్నారు. అందరూ 14 రోజుల పాటు ఇళ్లలోంచి కదలొద్దని కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Here's AP CMO Tweet

కరోనావైరస్‌ కట్టడి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినా జనతా కర్ఫ్యూ  పిలుపునకు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ​కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మంత్రులతో కలిసి చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.

ఏపీలో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 in AP) నమోదయ్యాయి. విజయవాడలో ఒకటి, కాకినాడలో మరొకటి తాజాగా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కొత్తగా నమోదైన రెండు కేసులూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now