Road Accident: హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తూ.. దెందులూరు వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బోల్తా.. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు.. గాయపడిన 11 మందిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లా దెందులూరు వద్ద ఈ తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు.

Road Accident (Representational Image)

Hyderabad, April 4: హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయనగరం వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (Orange Travels Bus) ప్రమాదానికి గురైంది. ఏలూరు (Eluru) జిల్లా దెందులూరు వద్ద ఈ తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 25 మంది ప్రయాణికులు, ముగ్గురు డ్రైవర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బస్సు ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే దెందులూరు ఎస్సై వీరరాజు, హైవే పెట్రోలింగు పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు.

Execution In Ramadan Holy Month: పవిత్ర రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా.. మానవ హక్కుల సంఘాల ఆగ్రహం.. ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దహనం చేసిన కేసులో దోషికి మరణశిక్ష.. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 మందికి మరణశిక్ష అమలు

గాయపడిన వారిని నాలుగు అంబులెన్సులలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బోల్తా పడడానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

RBI Repo Rate Hike: మరో వడ్డనకు ఆర్బీఐ సిద్ధం.. వడ్డీ రేట్లు మళ్లీ పెంచే ఛాన్స్‌.. ఆందోళనలో సామాన్యులు.. తొమ్మిది నెలల వ్యవధిలో ఇప్పటికే, 2.50 శాతం పెరిగిన వడ్డీ రేటు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement