Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్‌ లో అక్రమాల ఆరోపణలు.. శ్వేతపత్రం విడుదల చేసిన సుబ్బారెడ్డి.. మే 31 నాటికి రూ. 861 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడి

శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీలో అవినీతి చేయాలంటే ఎలాంటి వారైనా భయపడాల్సిందేనని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

TTD Chairman YV Subba Reddy (Photo-TTD)

Tirumala, June 23: శ్రీవాణి ట్రస్టుపై (Srivani Trust) వస్తున్న అవినీతి ఆరోపణలపై టీటీడీ (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbhareddy) స్పందించారు. టీటీడీలో అవినీతి చేయాలంటే ఎలాంటి వారైనా భయపడాల్సిందేనని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఈ ఏడాది మే 31 నాటికి రూ. 861 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆ లావాదేవీలు మొత్తం బ్యాంకు ద్వారానే జరిగినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. 2018లోనే శ్రీవాణి ట్రస్టు ప్రారంభమైందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో ట్రస్టును పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు.

Titanic Tourist Submarine Rescue Operation: నీటి అడుగున శబ్దాలను గుర్తించిన కెనడియన్ పి-3 విమానం, టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ వెతుకులాటలో పురోగతి

ఖర్చులు ఇలా..

దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం రూ. 120.24 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఇతర రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. ఈ పనుల కోసం రూ. 139 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 2,273 ఆలయాల నిర్మాణానికి రూ. 227.30 కోట్లు కేటాయించినట్టు వివరించారు.

జైలులో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు, 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతి, మొత్తం 41 మంది మహిళా ఖైదీలు మృతి

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement