Titanic Tourist Submarine Rescue Operation: నీటి అడుగున శబ్దాలను గుర్తించిన కెనడియన్ పి-3 విమానం, టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ వెతుకులాటలో పురోగతి

అట్లాంటిక్ మహా సముద్రంలో ఐదుగురు వ్యక్తులతో అదృశ్యమైన పర్యాటక జలాంతర్గామి కోసం కెనడియన్ పి-3 విమానం "శోధన (Titanic Tourist Submarine Rescue Operation) ప్రాంతంలో నీటి అడుగున శబ్దాలను (Underwater Noises) గుర్తించింది" అని యుఎస్ కోస్ట్ గార్డ్ బుధవారం (US Coast Guard Confirms) ధృవీకరించింది

Titanic Tourist Submarine Rescue Operation: నీటి అడుగున శబ్దాలను గుర్తించిన కెనడియన్ పి-3 విమానం, టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ వెతుకులాటలో పురోగతి
Submarine Representational Image (Picture Credit: Pixsbay)

వాషింగ్టన్, జూన్ 21: అట్లాంటిక్ మహా సముద్రంలో ఐదుగురు వ్యక్తులతో అదృశ్యమైన పర్యాటక జలాంతర్గామి కోసం కెనడియన్ పి-3 విమానం "శోధన (Titanic Tourist Submarine Rescue Operation) ప్రాంతంలో నీటి అడుగున శబ్దాలను (Underwater Noises) గుర్తించింది" అని యుఎస్ కోస్ట్ గార్డ్ బుధవారం (US Coast Guard Confirms) ధృవీకరించింది. వరుస ట్వీట్లలో, కోస్ట్ గార్డ్ ఇలా చెప్పింది: "కెనడియన్ P-3 విమానం (Canadian P-3 Aircraft) శోధన ప్రాంతంలో నీటి అడుగున శబ్దాలను గుర్తించింది. ఫలితంగా, శబ్దాల మూలాన్ని అన్వేషించే ప్రయత్నంలో ROV కార్యకలాపాలు మార్చబడ్డాయి. ఆ ROV శోధనలు ప్రతికూలతను అందించాయి.

అదనంగా, భవిష్యత్ శోధన ప్రణాళికలలో పరిగణించబడే తదుపరి విశ్లేషణ కోసం P-3 విమానం నుండి డేటా మా US నేవీ నిపుణులతో భాగస్వామ్యం చేయబడింది." సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారుల నుండి ఇది మొదటి అధికారిక ధృవీకరణ, అయినప్పటికీ "బ్యాంగ్" శబ్దాలు ఏమిటో వారు పేర్కొనలేదు. US కోస్ట్ గార్డ్ అధికారిక ధృవీకరణకు ముందు, US ప్రభుత్వ అంతర్గత మెమోలను ఉటంకిస్తూ అనేక అమెరికన్ మీడియా సంస్థలు, జూన్ 18న సబ్ అదృశ్యమైన ప్రాంతం నుండి 30 నిమిషాల వ్యవధిలో కెనడియన్ సెర్చ్ ఎయిర్‌క్రాఫ్ట్ "బ్యాంగ్" చేసినట్లు గుర్తించిందని నివేదించింది.అయితే ఈ చప్పుడు ఎప్పుడు, ఎంతసేపు కొనసాగింది అనేది అస్పష్టంగా ఉంది.

జైలులో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు, 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతి, మొత్తం 41 మంది మహిళా ఖైదీలు మృతి

మిస్సైన మినీస‌బ్ కోసం అమెరికా, కెన‌డా కోస్టు గార్డు నౌక‌లు విస్తారంగా శోధిస్తున్నాయి. దాదాపు 20వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల మేర స‌ముద్రాన్ని అన్వేషిస్తున్నారు. కెన‌డాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో మినీ స‌బ్ ఆచూకీ లేకుండాపోయింది. ప్ర‌తి 30 నిమిషాలకు ఒక‌సారి భారీ శ‌బ్ధాలు వ‌స్తున్న‌ట్లు గుర్తించామ‌ని కోస్టు గార్డులు వెల్ల‌డించారు.

ఓసియ‌న్‌గేట్ కంపెనీకి చెందిన టైటాన్ స‌బ్‌లో ముగ్గురు ప్ర‌యాణికులు ఉన్నారు. బ్రిటీష్ బిలియ‌నీర్ హ‌మీశ్ హార్డింగ్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన వ్యాపార‌వేత్త షెహ‌జాద్ దావూత్‌తో పాటు ఆయ‌న కుమారుడు సులేమాన్ ఉన్నారు. ఓసియ‌న్‌గేట్ చీఫ్ స్టాక్‌ట‌న్ ర‌ష్‌తో పాటు ఫ్రెంచ్ స‌బ్‌మెరైన్ ఆప‌రేట‌ర్ పౌల్ హెన్రీ న‌ర్జేలెట్ కూడా ఆ స‌బ్‌లో ఉన్నారు.ఈ సాహసయాత్రలో పాల్గొనేందుకు ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు రూ.రెండు కోట్లు వసూలు చేశారు. సెయింట్‌ జాన్స్‌ న్యూఫౌండ్‌లాండ్స్‌కు 700 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగినట్టు ఓషియన్‌గేట్‌ సంస్థ తెలిపింది.

వీడియో ఇదిగో, ఎత్తిన బీర్ దించకుండా 17 సెకన్లలో ఖాళీ చేసిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు

అట్లాంటిక్‌ సముద్రంలో టైటానిక్‌ శకలాల్ని చూడటానికి కొంతమంది చేపట్టిన సాహసయాత్ర ఊహించని ప్రమాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. టూరిస్ట్‌ సంస్థ ఓషియన్‌గేట్‌ పంపిన ‘టైటానిక్‌ సబ్‌ మెర్సిబుల్‌’ (మినీ జలాంతర్గామి) ఆదివారం రాత్రి గల్లంతైంది. కెన‌డాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 600 కిలోమీట‌ర్ల దూరంలో టైటానికి శిథిలాల వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. టూరిస్టు స‌బ్‌మెర్సిబుల్ డైవ్ చేసిన గంటా 45 నిమిషాల త‌ర్వాత ఆ స‌బ్‌తో లింక్ క‌ట్ అయ్యింది. అయితే ఆ స‌బ్‌లో నాలుగు రోజుల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. టైటాన్ స‌బ్‌మెర్సిబుల్ సుమారు 10,432 కిలోల బ‌రువు ఉంటుంది. 6.7 మీట‌ర్ల పొడుగు ఉంటుంది. 96 గంట‌ల పాటు దాంట్లో అయిదుగురు ఉండ‌వ‌చ్చు. స‌బ్‌లో 8 రోజుల ప‌ర్య‌ట‌న‌కు రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూల్ చేస్తున్నారు.

ఈ ప్రమాదంతో అమెరికా, కెనడా రక్షణ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఆచూకీ కనుగొనేందుకు ఇరు దేశాల కోస్ట్‌గార్డ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న చోట ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలో దించారు.

1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 22 అడుగులు పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు.ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు.

(The above story first appeared on LatestLY on Jun 21, 2023 01:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).