Y. S. Sharmila: ఏపీలో షర్మిల పార్టీపై సస్పెన్స్, వ్యూహాత్మక సమాధానం ఇచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని తెలిపిన షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (Y. S. Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై (political party Establishment in Andhra Pradesh) మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు.

YS Sharmila (Pic Credit: IANS/ Twitter )

Hyd, Jan 3: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (Y. S. Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై (political party Establishment in Andhra Pradesh) మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు... పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అని వ్యాఖ్యనించారు. కొంత కాలంగా సోదరుడు జగన్ తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. మొన్న పులివెందుల వెళ్లినప్పుడు కూడా జగన్, షర్మిల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్త గుప్పుమంది. అయితే న్యూ ఇయర్ రోజున షర్మిల జగన్ ఇంటికి వెళ్లడంతో ఈ వార్తలు తుస్సుమన్నాయి.

తాజాగా ఏపీలో పార్టీ పెడతారా అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల వ్యూహాత్మకంగా సమాధానం (YS sharmila Interesting comments ) ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. తామొక మార్గాన్ని ఎంచుకున్నామని, ఈనెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రైతు ఆవేదన యాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారని, కరోనా నిబంధనలు పాటిస్తామంటున్నా అనుమతి ఇవ్వడం లేదన్నారు.

కీలక అంశాలే ఎజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీతో సాయంత్రం 4 గంటలకు భేటీ, రేపు హోం మంత్రితో భేటీ అయ్యే అవకాశం

ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం నిబంధనలు అడ్డురావా? అన్ని ప్రశ్నించారు. నిబంధనల వంకతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని షర్మిల మండిపడ్డారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: పార్టీ గీత దాటితే వేటే.. అనుమానులుంటే అంతర్గతంగా చర్చించాలి, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, సర్పంచ్‌లను ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యేలకు టార్గెట్!

KTR: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే..యూజీసీ నిబంధనలపై కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి

YS Jagan Slams Chandrababu: చంద్రబాబు కాదు చంద్రముఖి.. ఏపీ సీఎంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం, బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?,వాలంటీర్లనే కాదు ఉద్యోగులకు హ్యాండ్‌ ఇచ్చిన బాబు

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివరాలివే

Share Now