Revanth Reddy Review on Kaleshwaram Project: రాబోతున్న వ‌ర్షాకాలం! కాళేశ్వ‌రం ప్రాజెక్టు రిపేర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క మీటింగ్, మ‌రోసారి క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయం

సచివాలయంలో శనివారం సాయంత్రం చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (NDSA) మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ సీఎంతో పాటు మంత్రులకు ఉత్తమ్ కుమార్​రెడ్డి వివరించారు

Hyderabad, May 18: కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై, ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి సచివాలయంలో శనివారం సాయంత్రం చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (NDSA) మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ సీఎంతో పాటు మంత్రులకు ఉత్తమ్ కుమార్​రెడ్డి వివరించారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Telangana Cabinet Meeting: తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నికల సంఘం షాక్, అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినెట్ స‌మావేశం వాయిదా 

రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శనివారం నాటి కేబినేట్ భేటీ జరగకపోవడంతో ఈ కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్‌లనును క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి

Advertisement
Advertisement
Share Now
Advertisement