Hyderabad Student Died In London: ఇంగ్లాండ్‌లో హైదరాబాద్‌ యువతి మృతి, సరదాకోసం బీచ్‌కు వెళ్లి అలల్లో చిక్కుకున్న సాయితేజస్వీ రెడ్డి, మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు యత్నాలు

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి చెందిన ఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది. ఇంగ్లాండ్ లో తెలంగాణ యువతి మృతి చెందారు. లండన్ లోని బీచ్ లో హైదరాబాద్ కు (Hyderabad Student ) చెందిన విద్యార్థిని కె. సాయి తేజస్విని రెడ్డి (Sai Tejaswini Reddy) మరణించారు.

K. Sai Tejaswini Reddy (PIC @ FB)

Hyderabad, April 20: అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి చెందిన ఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది. ఇంగ్లాండ్ లో తెలంగాణ యువతి మృతి చెందారు. లండన్ లోని బీచ్ లో హైదరాబాద్ కు (Hyderabad Student ) చెందిన  విద్యార్థిని కె. సాయి తేజస్విని రెడ్డి (Sai Tejaswini Reddy) మరణించారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజిన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఉన్నత చదువుల కోసం లండన్ కు వెళ్లింది. యూకేలోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో ఆమె ఏరో నాటిక్స్, స్పేస్ మాస్టర్ డిగ్రీ ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో కె.సాయి తేజస్విని రెడ్డి ఏప్రిల్ 11న లండన్ లోని బ్రైటన్ బీచ్ కు వెళ్లింది. అక్కడి నీటి అలల్లో చిక్కుకుని ప్రమాదవశాత్తు మృతి చెందారు. దీంతో అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై విచారణ చేపట్టారు.

Medico Preethi Case: మెడికో ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం, నిందితుడు సైఫ్‌కు బెయిల్, 16 వారాల పాటూ కోర్టుకు రావాలంటూ కండీషన్, సాక్ష్యాలు తారుమారు చేస్తే బెయిల్ రద్దే 

సాయి తేజస్విని మృతదేహాన్ని యూకేలోని ఓ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆమె మృతదేహాన్ని భారత్ కు తీసుకుని రావడానికి సహకరించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆమె కుటుంబ సభ్యులు ట్విటర్ ద్వారా కోరారు. దీంతో వారి అభ్యర్థనపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ‘మీకు జరిగిన నష్టానికి చాలా చింతిస్తున్నాం.. నా టీమ్ స్థానిక బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ను కలిసి వెంటనే సహాయం చేస్తుంది’ అని రీ ట్వీట్ శారు. అలాగే సాయి తేజస్విని రెడ్డి సోదరి ప్రియా రెడ్డి చేసిన ట్వీట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్.. సాయి తేజస్విని రెడ్డి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు కుటుంబం చాలా అధికార సవాళ్లను ఎదుర్కొంటుందని రీట్వీట్ చేశారు.

Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో ముగిసిన అవినాష్ రెడ్డి విచారణ, ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ, రేపు 10.30కు రావాలని కడప ఎంపీకి ఆదేశాలు 

కాగా, కె.సాయి తేజస్విని రెడ్డి మృతదేహాన్ని శుక్రవారం ఢిల్లీకి చేరకుంటుందని బీజేపీ ఐఎస్ సదన్ డివిజన్ కు చెందిన భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్ర బాబు పేర్కొన్నారు. అదే రోజు రాత్రికి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఉదయం చంపాపేటలోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement