PRC For Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌, రెండో పీఆర్సీ కమిటీ కోసం కసరత్తు, రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో త్వరలోనే కమిటీ

తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు (Telangana Government Employees) గుడ్ న్యూస్ తెలిపింది. జీతభత్యాల సవరణకు త్వరలో పే రివిజన్ కమిషన్ (PRC)ని అమలు చేయనుంది. జులై ఆఖరులో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ నేత‌ృత్వంలో పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది.

KCR (Credits: T News)

Hyderabad, July 21: తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు (Telangana Government Employees) గుడ్ న్యూస్ తెలిపింది. జీతభత్యాల సవరణకు త్వరలో పే రివిజన్ కమిషన్ (PRC)ని అమలు చేయనుంది. జులై ఆఖరులో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ నేత‌ృత్వంలో పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండో పీఆర్సీ (PRC) రానుంది. త్వరలోనే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. తెలంగాణలో రెండో సారి పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015లో బీస్వాల్ పీఆర్సీ కమిటీ ఏర్పాటు అయింది. దాని తర్వాత పీఆర్సీ ఫిట్ మెంట్ ను 2021లో అమలు చేసింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికనుగుణంగా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక రెండో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.

Telangana Floods: గోదావరి నది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు 

జులై నెల ఆఖరుకు ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ నేతృథ్వంలో ఈ కమిటీ ఉండనుంది. ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికనుగుణంగా జీతభత్యాల పెంపు జరగాల్సివుంటుంది. కాబట్టి వీటన్నింటికీ సంబంధించి పీఆర్సీ కమిటీ అధ్యయనం చేస్తుంది. దాని తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

MLC Kavitha Challenges Dharmapuri Arvind: అర్వింద్ నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నాపై చేసిన అవినీతి ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని కవిత సవాల్ 

అందుకనుగుణంగానే ప్రభుత్వం ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వబోతుంది. గతంలో బీస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది. దీనికనుగుణంగా ఈసారి రెండో ఫిట్ మెంట్ అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి. తొలుత 2015లో ఒకసారి ఉద్యోగులకు ప్రభుత్వం ఫిట్ మెంట్ ఇచ్చినప్పటికీ అది ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పీఆర్సీ కమిటీని వేసింది. దానికనుగుణంగా 2015లో మొదటిసారి 43 శాతం ఫిట్ మెంట్ ను సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చారు. బీస్వాల్ కమిటీ ఏర్పాటు తర్వాత 2015లో దానికి సంబంధించిన రిపోర్టుకు అనుగుణంగా 2021లో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇచ్చింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement