Telangana Shocker: చెల్లెలిపై అదేపనిగా అత్యాచారం చేయడమేందిరా కామాంధుడా, కరోనాలో రెండేళ్ల నుంచి సోదరిపై కామవాంఛ తీర్చుకున్న అన్న, బాలిక గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి..

తెలంగాణలో సభ్యసమాజం తలదించుకునే చోటు చేసుకుంది. మృగంగా మారిన ఓ అన్న సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి (17-Year-Old Boy Rapes) ఒడి గట్టాడు.రెండేండ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చడంతో ఈ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం బాచుపల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకున్నది.

Rape Representative image.

Hyd, May 20: తెలంగాణలో సభ్యసమాజం తలదించుకునే చోటు చేసుకుంది. మృగంగా మారిన ఓ అన్న సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి (17-Year-Old Boy Rapes) ఒడి గట్టాడు. రెండేండ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాచుపల్లి పీఎస్‌ పోలీసులు, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…కేరళకు చెందిన ఓ కుటుంబం 40 ఏండ్ల కిందట నగరానికి వచ్చి నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి, బాచుపల్లిలోని కాసాని కౌసల్యకాలనీలో నివాసముంటుంది. కుటుంబ యజమాని వ్యాపారి కాగా.. భార్య సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వీరికి ఓ కొడుకు(17), కూతురు(14) ఉన్నారు.

కొడుకు స్థానికంగా ఉన్న ఇంటర్నేషనల్‌ పాఠశాలలో ఇంటర్‌ ద్వితీయసంవత్సరం చదువుతుండగా, కూతురు మరో పాఠశాలలో 9వ తరగతి (13-Year-Old Sister in Hyderabad) చదువుతున్నది. అయితే డబుల్‌బెడ్‌ రూం ఇంట్లో నివాసముంటున్న వీరి కుటుంబానికి కరోనావైరస్ శాపంగా మారింది. ఆన్‌లైన్‌ క్లాస్‌ల నేపథ్యంలో గడిచిన రెండేండ్లుగా దంపతులిద్దరూ రాత్రి వేళల్లో ఒక గదిలో నిద్రిస్తుండగా, అన్నాచెల్లెలు మరో గదిలో నిద్రిస్తుండేవారు. ఈ క్రమంలో బాలికను లొంగదీసుకున్న సోదరుడు తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఇలా రెండేండ్లు అఘాయిత్యానికి ఒడిగడుతూనే ఉన్నాడు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అంతా బూటకం, సుప్రీంకు నివేదికను సమర్పించిన సిర్పూర్క‌ర్ క‌మిష‌న్, దిశ హత్యాచారం కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు

గత ఆరునెలల కిందట బాలిక రజస్యల కావడంతో ఈ నేపథ్యంలో ఇటీవల గర్భం దాల్చింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లి వైద్యశాలకు తీసుకువెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దంపతులు మూడు రోజుల కిందట ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ విభాగం అధికారులకు ఫిర్యాదు చేయగా, వారి సూచన మేరకు బాచుపల్లి పోలీసులు బాలుడిపై పోక్సో కేసును నమోదు చేశారు. అనంతరం బాలుడిని జువైనల్‌ హోంకు తరలించారు. బాధిత బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ప్రియుడితో అక్క రాసలీలలు, వద్దని వార్నింగ్ ఇచ్చాడని తమ్ముడిని నరికేసింది, ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టిన కామాంధురాలు

ఇక ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవులలో మరో దారుణం జరిగింది. వావివరసలు మరిచి ఓ కామాంధుడు సొంత చిన్నాన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. మైనర్‌ అని చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో బాలిక ఎవరికి చెప్పలేదు. అయితే కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళితే గర్భవతిగా వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now