AP Inter Supplementary Exams 2021: సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు, షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్మీడియెట్‌ విద్యామండలి, పరీక్ష ఫీజుకు చివరి తేది ఆగస్టు 17

ఏపీలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు–2021 సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు (AP Inter Supplementary Exams 2021) జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

AP 10th Class Exams Cancelled. Representational Image. |(Photo Credits: PTI)

ఏపీలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు–2021 సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు (AP Inter Supplementary Exams 2021) జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. కాగా మార్చిలో జరగాల్సిన పబ్లిక్‌ పరీక్షలు–2021 కోవిడ్‌ కారణంగా వాయిదా పడుతూ చివరకు రద్దయిన సంగతి తెలిసిందే.

ఉన్నత చదువులకు వీలుగా హైపవర్‌ కమిటీ సిఫార్సులను అనుసరించి ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు ఇటీవల ఇంటర్‌ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఆ విద్యార్థుల టెన్త్, ఇంటర్‌ ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. ఫస్టియర్‌ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది. సెకండియర్‌ ఫలితాల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు.

ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు, ఉత్తర్వులు జారీ చేసి పాఠశాల విద్యాశాఖ, రెగ్యులర్ విద్యార్థుల తరహాలోనే ఓపెన్ స్కూల్ విద్యార్థులనూ పాస్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడి

ఫస్టియర్‌ విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలు రాయవలసి ఉంటుంది. పరీక్ష ఫీజును ఆగస్టు 17లోపు చెల్లించాలి. జనరల్, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులంతా ఈ గడువులోగా ఫీజులు చెల్లించాలి. పబ్లిక్‌ పరీక్షలకు ఇంతకు ముందు ఫీజు చెల్లించిన ఫస్టియర్‌ విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

AP Inter Supplementary Exams 2021

బెటర్‌మెంట్‌ కోసం ఈ పరీక్షలకు హాజరవుదామనుకునే సెకండియర్‌ విద్యార్థులు కూడా ఫీజు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఇంతకు ముందు వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కుల్లో ఏవి ఎక్కువగా ఉంటే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. అటెండెన్స్‌ మినహాయింపుతో ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యే హ్యుమానిటీస్‌ అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించాలి. 2019లో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు బెటర్‌మెంట్‌ మార్కుల కోసం ఈ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలే చివరి అవకాశం. పరీక్షల తేదీలను పొడిగించబోమని బోర్డు కార్యదర్శి రామకృష్ణ చెప్పారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now