28 Trains Cancelled: ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లు అలెర్ట్.. వారం రోజులపాటు 28 రైళ్ల రద్దు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు.. ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలోనే నిర్ణయం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ప్రయాణించే 28 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది.

Credits: Google (Representational Image)

Hyderabad, June 19: తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) సహా పలు రాష్ట్రాలకు ప్రయాణించే 28 రైళ్లను (Trains) వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. అలాగే, 23 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నేటి నుంచి ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

TTD Seva Tickets: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..

రద్దయిన రైళ్లు ఇవే..

  • కాజీపేట-బలార్షా, బలార్షా-కాజీపేట (17035/17036),
  • కాచిగూడ- నిజామాబాద్‌, నిజామాబాద్‌-కాచిగూడ (07596/07593)
  • నిజామాబాద్‌-నాందేడ్‌, నాందేడ్‌-నిజామాబాద్‌ (07853/07854)
  • కాచిగూడ -నడికుడ, నడికుడ-కాచిగూడ (07791/07792)
  • కాజీపేట-డోర్నకల్‌, డోర్నకల్-కాజీపేట (07753/07754)
  • డోర్నకల్‌-విజయవాడ, విజయవాడ-డోర్నకల్‌ (07755/07756)
  • భద్రాచలం-విజయవాడ, విజయవాడ-భద్రాచలం(07278/07979)
  • సికింద్రాబాద్‌-వికారాబాద్‌, వికారాబాద్‌-కాచిగూడ (07591/07592)
  • సికింద్రాబాద్‌-వరంగల్‌, వరంగల్‌-హైదరాబాద్‌ (07462/07463)
  • సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-సిర్పూర్‌ టౌన్‌ (07766/07765)
  • కరీంనగర్‌-నిజామాబాద్‌, నిజామాబాద్‌-కరీంనగర్‌ (07894/07893),
  • వాడి-కాచిగూడ (07751)
  • ఫలక్‌నుమా-వాడి (07752)
  • కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌ (17003)
  • బలార్షా-కాజీపేట (17004)
  • భద్రాచలం -బలార్షా (17033)
  • సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం (17034)

Kalyanam at Yellamma Devasthanam: నేడు బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పాక్షికంగా రద్దయినవి ఇవే..

నిన్నటి నుంచి ఈ నెల 24 వరకు దౌండ్‌-నిజామాబాద్‌ (11409) రైలును దుద్ఖేడ్‌-నిజామాబాద్‌ మధ్య, నేటి నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్‌-పండర్‌పూర్‌ (01413) రైలును నిజామాబాద్‌-ముద్ఖేడ్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. నేటి నుంచి 25 వరకు నంద్యాల- కర్నూలు సిటీ (07498) రైలును  డోన్‌-కర్నూల్‌సిటీ మధ్య,  కర్నూలు -గుంతకల్‌ (07292) రైలు కర్నూలు సిటీ-డోన్‌ మధ్య పాక్షికంగా రద్దయ్యాయి.. కాచిగూడ- మహబూబ్‌నగర్‌ (07583) రైలును ఉందానగర్‌-మహబూబ్‌నగర్‌ల మధ్య, మహబూబ్‌నగర్‌-కాచిగూడ రైలు(07584) మహబూబ్‌నగర్‌-ఉందానగర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

Nagpur Horror: కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా.. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరిఆడక, వేడితో మరణం.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణం

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు, రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించిన పోలీసులు, బీఎన్‌ఎస్‌ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు

AP Assembly Session 2025: మెగా డీఎస్సీపై నారా లోకేష్ కీలక ప్రకటన, త్వరలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విద్యా శాఖ మంత్రి

Ramadan 2025 Wishes: నేటి నుంచి రంజాన్ మాసం... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్, లోకేశ్

Share Now