28 Trains Cancelled: ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లు అలెర్ట్.. వారం రోజులపాటు 28 రైళ్ల రద్దు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు.. ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలోనే నిర్ణయం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ప్రయాణించే 28 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది.

Credits: Google (Representational Image)

Hyderabad, June 19: తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) సహా పలు రాష్ట్రాలకు ప్రయాణించే 28 రైళ్లను (Trains) వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. అలాగే, 23 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నేటి నుంచి ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

TTD Seva Tickets: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..

రద్దయిన రైళ్లు ఇవే..

  • కాజీపేట-బలార్షా, బలార్షా-కాజీపేట (17035/17036),
  • కాచిగూడ- నిజామాబాద్‌, నిజామాబాద్‌-కాచిగూడ (07596/07593)
  • నిజామాబాద్‌-నాందేడ్‌, నాందేడ్‌-నిజామాబాద్‌ (07853/07854)
  • కాచిగూడ -నడికుడ, నడికుడ-కాచిగూడ (07791/07792)
  • కాజీపేట-డోర్నకల్‌, డోర్నకల్-కాజీపేట (07753/07754)
  • డోర్నకల్‌-విజయవాడ, విజయవాడ-డోర్నకల్‌ (07755/07756)
  • భద్రాచలం-విజయవాడ, విజయవాడ-భద్రాచలం(07278/07979)
  • సికింద్రాబాద్‌-వికారాబాద్‌, వికారాబాద్‌-కాచిగూడ (07591/07592)
  • సికింద్రాబాద్‌-వరంగల్‌, వరంగల్‌-హైదరాబాద్‌ (07462/07463)
  • సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-సిర్పూర్‌ టౌన్‌ (07766/07765)
  • కరీంనగర్‌-నిజామాబాద్‌, నిజామాబాద్‌-కరీంనగర్‌ (07894/07893),
  • వాడి-కాచిగూడ (07751)
  • ఫలక్‌నుమా-వాడి (07752)
  • కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌ (17003)
  • బలార్షా-కాజీపేట (17004)
  • భద్రాచలం -బలార్షా (17033)
  • సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం (17034)

Kalyanam at Yellamma Devasthanam: నేడు బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పాక్షికంగా రద్దయినవి ఇవే..

నిన్నటి నుంచి ఈ నెల 24 వరకు దౌండ్‌-నిజామాబాద్‌ (11409) రైలును దుద్ఖేడ్‌-నిజామాబాద్‌ మధ్య, నేటి నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్‌-పండర్‌పూర్‌ (01413) రైలును నిజామాబాద్‌-ముద్ఖేడ్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. నేటి నుంచి 25 వరకు నంద్యాల- కర్నూలు సిటీ (07498) రైలును  డోన్‌-కర్నూల్‌సిటీ మధ్య,  కర్నూలు -గుంతకల్‌ (07292) రైలు కర్నూలు సిటీ-డోన్‌ మధ్య పాక్షికంగా రద్దయ్యాయి.. కాచిగూడ- మహబూబ్‌నగర్‌ (07583) రైలును ఉందానగర్‌-మహబూబ్‌నగర్‌ల మధ్య, మహబూబ్‌నగర్‌-కాచిగూడ రైలు(07584) మహబూబ్‌నగర్‌-ఉందానగర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

Nagpur Horror: కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా.. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరిఆడక, వేడితో మరణం.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణం

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement