TTD SED Tickets: నేడు శ్రీవారి 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో.. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
Tirumala, Nov 10: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది. మొత్తం 2.25 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. రోజుకు 2 వేల టికెట్ల చొప్పున 10 రోజుల పాటు 20 వేల టికెట్లను టీటీడీ విడుదల చేయాలని నిర్ణయించింది.
ఈ కోటా కూడా..
నేటి సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను కూడా టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఇక డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠద్వార దర్శన టికెట్లను కూడా విడుదల చేయనున్నట్టు టీటీడీ మరో ప్రకటనలో తెలియజేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Leopard Spotted In Tirumala: తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర చిరుత పులి కలకలం.. వీడియో వైరల్
Tirumala: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్, వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
TTD Tickets: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement