Karnataka Horror: తాగొచ్చి కొడుకును కొట్టిన తండ్రి, కోపం ఆపుకోలేక తండ్రిని 32 ముక్కలుగా నరికి వాటిని బోరు బావిలో పడేసిన కొడుకు, కర్ణాటక బాగల్కోట్లో దారుణ ఘటన
కర్ణాటక బాగల్కోట్లో శ్రద్ద వాకర్ హత్య తరహా లాంటి దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో సొంత కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు (son Chops Up Father's Body Into 32 Pieces) చేశాడు.
Bengaluru, Dec 13: కర్ణాటక బాగల్కోట్లో శ్రద్ద వాకర్ హత్య తరహా లాంటి దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో సొంత కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు (son Chops Up Father's Body Into 32 Pieces) చేశాడు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకొద్దని వాటిని తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో (Dumps In Borewell) పడేశాడు. డిసెంబర్ 6న ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడ్ని విఠల కులాలి(20)గా, అతని తండ్రి పేరు పరశురామ్ కులాలి(53)గా గుర్తించారు పోలీసులు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. పరశురామ్ తాగుబోతు. రోజు ఫుల్లుగా మద్యం సేవించి కుమారుడ్ని తిట్టేవాడు. ఇతని బాధ భరించలేక భార్య, పెద్ద కుమారుడు వేరే ఇంట్లో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు విఠల తండ్రితో పాటు ఉంటున్నాడు. పరశురామ్ రోజు తాగొచ్చి విఠల్ను దుర్భాషలాడేవాడు. కానీ, గత మంగళవారం తండ్రి తిట్లను భరించలేకపోయిన విఠల.. ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో పరశురామ్ చనిపోయాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు.ఈ శరీర భాగాలను తీసుకెళ్లి మంతూర్ బైపాస్ వద్ద తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు.
విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి విఠలను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బోరుబావి నుంచి పరశురామ్ శరీర భాగాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రొక్లేన్లతో తవ్వారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)