Maha Kumbh Road Accident: మహా కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి.. 19 మందికి గాయాలు

మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలనుకున్న వారి కలలు కల్లలుగా మారాయి. రోడ్డుప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది.

Representative Image (Photo Credit- PTI)

Newdelhi, Feb 15: మహా కుంభమేళాలో (Maha Kumbhmela) పుణ్యస్నానాలు ఆచరించాలనుకున్న వారి కలలు కల్లలుగా మారాయి. రోడ్డు ప్రమాదం (Road Accident) రూపంలో వారిని మృత్యువు కబళించింది. పూర్తి వివరాల్లోకివెళ్తే, ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని మీర్జాపూర్‌-ప్రయాగ్‌ రాజ్‌ జాతీయ రహదారిపై బస్సు, బొలెరో వాహనాలు పరసపరం ఢీకొన్నాయి. ప్రయాగ్‌ రాజ్‌ లో కుంభమేళాకు వెళ్తున్న క్రమంలో శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 19 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులందరూ ఛత్తీస్‌ గఢ్‌ కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ప్రమాదం నేపథ్యంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

తండ్రి కండ్ల ముందే 20 ఏండ్ల కొడుకును అమాంతం మింగేసిన భారీ తిమింగలం.. ఆ తర్వాత ఏం జరిగింది? ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూశారా?

మొన్న హైదరాబాద్ వాసులు

ప్రయాగ్‌ రాజ్‌ లో కుంభమేళాకు వెళ్లి తిరుగుపయనమైన హైదరాబాద్ ఏడుగురు యాత్రికులు గతవారం రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడటం తెలిసిందే. మధ్యప్రదేశ్‌ లోని జబల్‌ పుర్‌ వద్ద మృతులు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్‌ లోడ్‌ తో వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టింది. మృతులు నాచారం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌ పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. ట్రాఫిక్‌ పోలీస్‌ బూత్‌ దిమ్మెల్ని ఢీకొట్టి భయోత్పాతం (వీడియో)

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now