Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి సుప్రీం నోటీసులు, ప్రాజెక్ట్ కోసం పర్యావరణ అనుమతుల్లో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు, నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

పోలవరం బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టుకు (Polavaram Project) పర్యావరణ అనుమతుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రంతో పాటు సంబంధిత రాష్ట్రాల స్పందనను (Supreme Court Seeks Centre's Response) సుప్రీంకోర్టు కోరింది

Supreme Court today slashed an 18-year jail sentence (Photo Credits: IANS)

New Delhi, Dec 29: పోలవరం బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టుకు (Polavaram Project) పర్యావరణ అనుమతుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రంతో పాటు సంబంధిత రాష్ట్రాల స్పందనను (Supreme Court Seeks Centre's Response) సుప్రీంకోర్టు కోరింది.

జస్టిస్‌లు సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం.. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఫిబ్రవరి 2023లోగా సమాధానం చెప్పాలని బెంచ్ కోరింది. జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ సమస్యలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు విమర్శించింది, ఇప్పటికే ఉన్న చట్టపరమైన స్థితికి కట్టుబడి ఉండాలని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రేటు వివరాలు ఇవే, తెలంగాణలో పెరిగిన క్రైమ్, ఏపీలో తగ్గిపోయిన క్రైమ్‌ రేటు

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాలపై పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (ప్రాజెక్ట్‌ ప్రతిపాదకుడు) సంయుక్త కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్‌జీటీ ఈ విధంగా వ్యవహరించిందని న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు రోడ్ షో ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని ఆదేశాలు

"ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలు పర్యావరణ ఉల్లంఘనలకు (Alleging Violations in Environmental Clearance) సంబంధించినవి, ప్రాజెక్ట్ అధికారులు పర్యావరణ క్లియరెన్స్‌లో విధించిన ముందుజాగ్రత్త షరతులను అమలు చేయకపోవడానికి సంబంధించినవని తన అభ్యర్ధనలో పేర్కొంది.ఈ స్థలంలో పర్యావరణ ఉల్లంఘన జరిగిందని పుల్లారావు ఆరోపిస్తూ, ప్రాజెక్టు సమీపంలోని వ్యవసాయ భూమిలో భారీ మొత్తంలో వ్యర్థ పదార్థాలను డంప్ చేస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే చెల్లించిన చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.2,937.92 కోట్ల బిల్లులను క్లియర్ చేయడంతో పాటు తాత్కాలిక చెల్లింపుగా రూ.10,485.38 కోట్లను బుధవారం కేంద్రాన్ని కోరారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement