Amaravati Farmers Bandh: రాజధాని గ్రామాల్లో బంద్, అమరావతి పరిధిలోని 29 గ్రామాలు బంద్‌లోకి.., అసెంబ్లీలో 3 రాజ‌ధానుల బిల్లు ఆమోదం, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్న రైతులు

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు(Three Capitals) నిరసనగా నేడు ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలోని గ్రామాలు బంద్‌ కు పిలుపు నిచ్చాయి. దీంతో పాటుగా రైతులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా అమరావతి జేఏసీ (Amaravathi JAC) బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాజధానిలోని 29 గ్రామాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.

Three Capitals Issue AP Capital Farmers Protest For Amaravathi (photo-ANI)

Amaravati, January 21: ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు(Three Capitals) నిరసనగా నేడు ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలోని గ్రామాలు బంద్‌ కు పిలుపు నిచ్చాయి. దీంతో పాటుగా రైతులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా అమరావతి జేఏసీ (Amaravathi JAC) బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాజధానిలోని 29 గ్రామాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.

చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం

బంద్‌ నేపథ్యంలో పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. అసెంబ్లీలో 3 రాజ‌ధానుల బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన త‌మ పోరాటం ఆగ‌దని రైతులు(Amaravati Farmers Protest) స్ప‌ష్టం చేశారు. ఈ రోజు మ‌ధ్యా‌హ్నం వ‌ర‌కు సిఆర్‌డిఎకి (CRDA)అభిప్రాయాలు చెప్పు‌కునే స‌మ‌యం కోర్టు ఇవ్వ‌గా.. ముందే బిల్లు‌ను ఎలా ఆమోదిస్తా‌ర‌ని ప్ర‌శ్ని‌స్తు‌న్నా‌రు.

అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్

మంచినీరు సహా ఏ పదార్థాలు పోలీసులకు విక్రయించకూడదని, పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 35వ రోజుకు చేరుకున్నాయి. శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినా రైతులు తమ నిరసనలు ఆపడంలేదు.

Here's ANI Tweet

మందడం, తుళ్లూరులో మహాధర్నాలు వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు, మహిళలు నిరసన తెలుపుతూ పూజలు నిర్వహిస్తున్నారు. రాజధాని గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు రాజధానిపై ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

మరోవైపు రాజధాని గ్రామాల్లో పోలీసు పహారా కొనసాగుతోంది.  ప్రతి గ్రామానికిరెండు వైపులా  పోలీసులు మొహరించారు. సచివాలయానికి వెళ్లే మల్కాపురం  సెంటర్ లోనూ పోలీసులు భారీగా మొహరించారు.సచివాలయం వెనుక వైపు కూడా పోలీసు బందో బస్తుఏర్పాటు కొనసాగుతోంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement