Narendra Modi: యూపీలో నేడు ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లు, రూ. 12 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
Newdelhi, July 7: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నేడు ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) గోరఖ్పూర్తో(Gorakhpur)పాటు తన నియోజకవర్గమైన వారణాసిలో(Varanasi) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్ల (Vandebharat)తోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వజీద్పూర్లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ర్యాలీ అనంతరం ‘టిఫిన్ పే చర్చా’ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
TANA Sabha: తానా సభలకు హాజరైన నటసింహం.. బాలయ్యతో పాటు ఇళయరాజా, శ్రీలీల కూడా..
పర్యటన ఇలా..
- పర్యటనలో భాగంగా మోదీ తొలుత గోరఖ్పూర్ చేరుకుని గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు.
- తర్వాత, గోరఖ్పూర్-లక్నో వందేభారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభిస్తారు.
- జోధ్పూర్-సబర్మతి వందేభారత్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- ఆ తర్వాత.. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారు.
- ఆ తర్వాత వారణాసి చేరుకుని పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్, సన్నగర్ మధ్య ఫ్రైట్ కారిడార్ను, వారణాసి-జైపూర్ను కలిపే జాతీయ రహదారి 56 నాలుగు లేన్ల విస్తరణ పనులను, మణికర్ణిక ఘాట్, హరీశ్చంద్రఘాట్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారు.
- బనారస్ హిందూ యూనివర్సిటీలోని 10 అంతస్తుల ఇంటర్నేషనల్ హాస్టల్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement